కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఇప్పటికే విడుదలైంది. ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పేపర్లో రాసుకొచ్చి ఈవెంట్లో మాట్లాడారు. మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.. అంటూ తెలుగులో స్పీచ్ అదరగొట్టారు. కాగా.. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది.
ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి...
రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025


