టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.
కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు.
మృణాల్ ఠాకూర్ ని క్షమాపణలు కోరిన సుమంత్
'సీతారామం' లో నేను మృణాల్ కి క్షమాపణలు చెప్పిన సీన్ ఒకటి ఉంది
అది ఎడిటింగ్ లో డిలీట్ చేశారు
అందుకే నేను 'డెకాయిట్' లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించాను : సుమంత్#AdiviSesh #MrunalThakur #Dacoit #Sumanth pic.twitter.com/5a1tUXY1lh— Filmy Focus (@FilmyFocus) April 7, 2026


