
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ దుర్ఘటన నిజంగా దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషాదంపై ఇప్పటికే టాలీవుడ్ సినీతారలతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారుయ ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
