SSMB29: మహేశ్‌-ప్రియాంకతో ఫోక్‌ సాంగ్‌.. టైటిల్‌ ఇదే! | SSMB29: Another Rumour On Rajamouli, Mahesh Babu Film Title | Sakshi
Sakshi News home page

SSMB29: మహేశ్‌-ప్రియాంకతో ఫోక్‌ సాంగ్‌.. టైటిల్‌ ఇదే!

Oct 8 2025 6:49 PM | Updated on Oct 8 2025 8:01 PM

SSMB29: Another Rumour On Rajamouli, Mahesh Babu Film Title

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి(SS Rajamouli), సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో ఓ సినిమా(SSMB 29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. టైటిల్ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిమాదిరే టైటిల్ని గోప్యంగా ఉంచాడు. అంతేకాదు సినిమా షూటింగ్అప్డేట్కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే తాజాగా సినిమా టైటిల్విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలోని వచ్చింది. అదే వారణాసి. గతంలో పలు పేర్లు అనుకున్నా.. చివరకు రాజమౌళి పేరుకే మొగ్గు చూపినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

డివోషనల్టచ్‌..
ఆర్ఆర్ఆర్తర్వాత రాజమౌళి..మహేశ్బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే.. ఇదొక జంగిల్అడ్వెంచరస్మూవీ అని ప్రచారం జరిగింది. లీకైన షూటింగ్క్లింప్స్కూడా అలానే అనిపించాయి. అయితే జక్కన్న మాత్రం జంగిల్అడ్వెంచరస్కథకి డివోషినల్టచ్ఇచ్చాడట. ఆగస్ట్లో రాజమౌళి రిలీజ్చేసిన పోస్టర్చూస్తే కూడా ఇది నిజమనే తెలుస్తుంది. అందులో మహేశ్మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ఉంది. అది చూస్తే.. ఇందులో డివోషనల్ఎలిమెంట్స్ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చినవారణాసిటైటిల్కూడా పుకారుకి మరింత బలం చేకూర్చింది.

నవంబర్లో క్లారిటీ!
రాజమౌళి చిత్రాల టైటిల్స్యూనిక్గా ఉంటాయి. కథకు తగ్గట్లుగా టైటిల్స్పెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మహేశ్సినిమాకు వారణాసి అని పెట్టినట్లు తెలుస్తుంది. టైటిల్కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది. కానీ జక్కన్న చిత్రాన్ని పాన్వరల్డ్స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి టైటిల్ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా? అక్కడ వేరే టైటిల్తో రిలీజ్చేస్తాడా? అసలు వారణాసి టైటిల్ఫైనల్అయిందా లేదా అనేది తెలియాలంటే.. నవంబర్వరకు ఆగాల్సిందే

(చదవండి: ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేను..రూమర్స్‌పై స్పందించిన రష్మిక)

నవంబర్‌ 16 సినిమా టైటిల్అనౌన్స్చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్హైదరాబాద్లో జరుగుతోంది. షెడ్యూల్కోసం హైదరాబాద్శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్‌ వేశారట. అందులోనే మేజర్సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫోక్సాంగ్‌?
సినిమాలో ఫోక్సాంగ్కూడా ఉంటుందట. ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణీ జానపద బాణీని రాజమౌళికి ఇచ్చాడట. అది ఆయనకు బాగా నచ్చిందట. ట్రయల్షూట్కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్‌-ప్రియాంక చోప్రాల మధ్య సాంగ్ఉంటుందట.  ఆ ఫోక్‌ సాంగ్‌కి వీరిద్దరు వేసే ఊరమాస్‌ స్టెప్పులు అదిరిపోతాయట. మొత్తానికి ‘నాటు నాటు’ ని మించేలా ఆ పాటను తీర్చి దిద్దాలని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement