‘కరూర్‌ తొక్కిసలాట’.. పూరి జగన్నాథ్‌ కీలక నిర్ణయం! | Puri Jagannadh Vijay Sethupathi Film Title And Teaser Release Postponed | Sakshi
Sakshi News home page

‘కరూర్‌ తొక్కిసలాట’.. పూరి జగన్నాథ్‌ కీలక నిర్ణయం!

Sep 28 2025 2:24 PM | Updated on Sep 28 2025 4:24 PM

Puri Jagannadh Vijay Sethupathi Film Title And Teaser Release Postponed

తమిళనాడులో నటుడు, టీవీకే అధినేత విజయ్ రాజకీయ సభ పెను విషాదాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం కరూర్జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కొత్త సినిమా టైటిల్అనౌన్స్మెంట్‌, టీజర్విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

డబుల్ఇస్మార్ట్శంకర్తర్వాత కాస్త గ్యాప్తీసుకున్న పూరి.. ప్రస్తుతం విజయ్సేతుపతితో పాన్ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. #పూరిసేతుపతి అనే వర్కింగ్టైటిల్తో షూటింగ్కూడా ప్రారంభించారు. రోజు (సెప్టెంబర్‌ 28) చెన్నైలో టైటిల్‌, టీజర్రిలీజ్ఈవెంట్నిర్వహించాల్సి ఉంది. మేరకు చిత్ర యూనిట్పోస్టర్కూడా రిలీజ్చేసింది. అయితే కరూర్తొక్కిసలాట ఘటనతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకోవడంతో పూరి.. ఈవెంట్ని క్యాన్సిల్చేశారు.

సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూరులో టీవీకే సభలో జరిగిన దుర్ఘటన కారణంగా ఈరోజు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరగాల్సిన పూరీ సేతుపతి టైటిల్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తాం’అంటూ ఒక ప్రకటన రిలీజ్‌ చేశారు.  కాగా, ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్' అనే టైటిల్‌ పెట్టినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త నటించగా..  టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement