
ధనుష్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమ్ముల గిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘పిపీ డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చైతన్య పింగలి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి చౌహాన్ అద్భుతంగా ఆలపించారు.