పెళ్లి పనులు షురూ..ఆధ్యాత్మిక పర్యటనల్లో నయన్‌,విఘ్నేష్‌ బిజీబిజీ

Nayanthara And Vignesh Shivan Visits Their Ancestral temple In Tamil Nadu - Sakshi

కోలీవుడ్‌లో నటి నయనతార, దర్శకుడు వఘ్నేష్‌ శివన్‌ చాలా కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లెప్పుడు అన్న విషయంపై మీడియా ఇప్పటికే చాలా కథనాలు అల్లేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నయనతార విఘ్నేష్‌ శివన్‌ పళ్లి పీటలు ఎక్కడానికి సమయం ఆసన్నమైంది. జూన్‌9న ఈ జంట తిరుమలలో వివాహం చేసుకోబోతున్నారు. అంతకు ముందు పలు గుళ్లు గోపురాలు చుట్టేస్తుండటం విశేషం.

ఇటీవల తిరుపతికి వెళ్లి ఏడు కొండలస్వామిని దర్శించుకున్న ఈ జంట సోమవారం తిరుచ్చిలోని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథుని సేవించుకుంది. అనంతరం తంజావూరు జిల్లా అయ్యంపేట సమీపంలోని పళత్తూర్‌ గ్రామానికి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ కులదైవం కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి పాలు పొంగించి విశేష పూజలు చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top