Bipasha Basu: పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్‌

Karan Singh Grover and Bipasha Basu All Set to Welcome Their First Child - Sakshi

తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది బిపాషా బసు. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. కాగా వీరిద్దరూ 'ఎలోన్‌' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది.

ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారిద్దరూ. ఇదిలా ఉంటే తాజాగా బిపాషా తల్లి కాబోతుందంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీంతో అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్‌. మరి బిపాషా దీనిపై ఏమంటుందో చూడాలి!

చదవండి: నాకేదైనా అయితే ఆ మాఫియాను వదలకండి, వెంటాడండి..
ఓటీటీలో సందడి చేయనున్న స్టార్‌ హీరో మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top