నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే! | Director MS Raju Talks About Malli Pelli Movie | Sakshi
Sakshi News home page

నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో సినిమా చూసి తెలుసుకోవాలి

May 21 2023 4:18 AM | Updated on May 21 2023 7:39 AM

Director MS Raju Talks About Malli Pelli Movie - Sakshi

‘‘మళ్ళీ పెళ్లి’లో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్‌ అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లో ఈ మూవీకి బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఇచ్చాను’’ అని డైరెక్టర్‌ ఎంఎస్‌ రాజు అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ – ‘‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్‌ విజయ కృష్ణ మూవీస్‌. నరేశ్‌గారి 50 ఏళ్ల కెరీర్‌ను బేస్‌ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్‌ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు.



కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారుతుంటాయి. ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? వంటి అంశాలను  ‘మళ్ళీ పెళ్లి’లో చూపించాం. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవే. ‘డర్టీ హరి’ చేయమని ఓ యువ డైరెక్టర్‌ని అడిగితే.. ‘బోల్డ్‌ కంటెంట్‌.. చేయను’ అనడంతో నేనే దర్శకత్వం వహించాను. కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను.. లేదంటే ఇంట్లో కూర్చునేవాణ్ణి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement