ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్‌ సినిమా | Bade Miyan Chote Miyan OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్‌ సినిమా

May 30 2024 9:00 AM | Updated on May 30 2024 11:43 AM

Bade Miyan Chote Miyan OTT Streaming Date Locked

బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో  ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటన చేసింది.

కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో ఉన్న అక్షయ్‌కుమార్‌ ‘బడేమియా ఛోటేమియా’తో హిట్‌ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం మారలేదు. మరో డిజాస్టర్‌ ఆయన ఖాతాలో చేరిపోయింది. సుమారు రూ. 350 కోట్ల బ‌డ్జెట్‌తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాకు కేవలం రూ. 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్‌ చేసింది. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా క‌నిపిస్తే.. సానాక్షి సిన్హా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 

దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో భారీ తారాగ‌ణంతో పాటు కావాల్సినంత సాంకేతిక హంగులు, మంచి లొకేష‌న్లు ఉన్నాయి. యాక్షన్‌ సీన్స్‌లలో గ‌న్నులు, ట్యాంక‌ర్లు, హెలికాఫ్ట‌ర్లు అడుగ‌డుగునా ఉపయోగించి భీక‌ర పోరాటాలు చేసినా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్‌ అయింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న 'బడేమియా ఛోటేమియా'ను ఇంట్లోనే చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement