'8 ఏఎమ్‌ మెట్రో'.. ఇద్దరు అపరిచితుల కథ | 8 Am Movie To Release On This Date Details Here | Sakshi
Sakshi News home page

'8 ఏఎమ్‌ మెట్రో'.. ఇద్దరు అపరిచితుల కథ

Apr 15 2023 7:20 AM | Updated on Apr 15 2023 7:29 AM

8 Am Movie To Release On This Date Details Here - Sakshi

గుల్షన్‌ దేవయ్య, సయామీ ఖేర్‌ జంటగా ‘మల్లేశం’ చిత్రం ఫేమ్‌ రాజ్‌ రాచకొండ దర్శకత్వం వహించిన చిత్రం ‘8 ఏఎమ్‌ మెట్రో’. శిలాదిత్య బోరా ప్లాటూన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా మే 19న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ప్రముఖ గేయ రచయిత, దర్శకుడు గుల్జార్‌ ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ చదివినప్పుడు గొప్ప అనుభూతి కలిగింది. అందుకే నా కవితలు అందించాను’’ అన్నారు.

‘‘మెట్రో ట్రైన్‌లో కలుసుకుని, ఒకరినొకరు తెలుసుకునే ఇద్దరు అపరిచితుల కథే ఈ సినిమా’’ అన్నారు రాజ్‌ రాచకొండ. ‘‘ఈ చిత్రంలో నా పాత్రకి ఒక సీక్రెట్‌ ఉంది. అది ఇద్దర్నీ వేరు చేయడంతో పాటు నమ్మకాల్ని కూడా చీల్చుతుంది’’ అన్నారు గుల్షన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement