ఎమ్మెల్యే సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు నీటి సరఫరా, కాలువల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి మండిపడ్డారు. మండలంలోని మార్డిలో మంగళవారం లబ్ధిదారులకు స్మార్టురేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నల్లవాగు ప్రాజెక్టు కాల్వల్లో పూడిక తీయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పనులు చేయకుండా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివశ్రీనివాస్, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహరెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు పోచయ్య, రవీందర్రెడ్డి, దేవదాస్, జితేందర్రెడ్డి, సంగారెడ్డి పాల్గొన్నారు.


