
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
తూప్రాన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మాజీ జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంవిధాన్ బచావో ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం గ్రామ, మండల స్థాయి కమిటీల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్