చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్–2 గోల్డ్లోన్ బా ధితులు తొమ్మిది నెలలుగా చేస్తున్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. బ్యాంకులో గతేడాది ఆగస్టు 20న బంగారు ఆభరణాలు చోరీకి గురికాగా దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయం తెలిసిందే. బంగారం ఇవ్వడంతో బ్యాంకర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత నెల 30న బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చే పట్టారు. ఈ నెల 1న కోర్టు ఇంటీరియం కస్టడీ ఆ ర్డర్ వెలువరించింది. సొంత పూచీకత్తుతో ఆభరణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు.
శుభపరిణామమే..
కోర్టు ఇంటీరియం కస్టడీకి ఇవ్వడం శుభపరిణామమేనని, ఇప్పటికై నా మా బంగారం మాకు రావడం సంతోషంగా ఉందని బాధితులు నల్లకుంట అశోక్, బాలరాజు హర్షం వ్యక్తం చేశారు.


