ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 జూలైలో ఖానాపూర్ నుండి ఆదిలాబాద్కు ఒంటరిగా పాదయాత్ర చేపట్టా. పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి పాలకుల నుండి అనేక బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురయ్యాయి. జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపడంతో ఉద్యమంలో మరింత ఉత్సాహంగా పాల్గొన్నా. ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి పెన్షన్, ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
– ఆమ్టే శ్రీమతి, ఉద్యమకారిణి, ఆసిఫాబాద్


