గంగాపూర్‌ శివారులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

గంగాపూర్‌ శివారులో ఉద్రిక్తత

Mar 22 2026 5:33 AM | Updated on Mar 22 2026 5:33 AM

● అటవీ అధికారుల తవ్వకాలను అడ్డగింత ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు

● అటవీ అధికారుల తవ్వకాలను అడ్డగింత ● ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు

చింతలమానెపల్లి: గంగాపూర్‌ శివారులో అట వీ అధికారులు శనివారం తవ్వకాలు నిర్వహించారు. ఆ స్థలంలో సాగు చేస్తున్న రైతులు తవ్వకాలను అడ్డుకోవడంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. గంగాపూర్‌ నర్సరీ సమీపంలోఅధికారులు సర్వే నిర్వహించగా కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో కందకాల తవ్వకానికి చర్యలు తీసుకుంటుండగా పలువురు రైతులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమకు ప్రభుత్వం కేటా యించిందని, పనులను నిలిపివేయాలని కోరారు. ఈ భూమి అటవీశాఖదని సర్వేలో తేలినట్లుగా అధికారులు తెలుపగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏండ్లకు పైగా భూమిని సాగు చేస్తున్నామని భూమి లో కందకాలు తవ్వడంతో తాము నష్టపోతా మని వాపోయారు. ఈవిషయమై ఎఫ్‌ఆర్వో సుభాష్‌ మాట్లాడుతూ ఈ భూమి అటవీ ప్రాంతంలో ఉందని అటవీ పరిధి మేరకు పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతంలో త్వరలో ప్లాంటేషన్‌ పనులు నిర్వహిస్తామన్నారు. అటవీ అభివృధ్ధి పనుల్లో భాగంగా కందకాలు తవ్వుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement