నర్సాపూర్(జి): చోరీ కేసును 24 గంటల్లో ఛేదించినట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ కిరాణా దుకాణంలో గురువారం రాత్రి నిందితుడు రూ.4వేల నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి, 4 సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు. యజమాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బరుకుంట శ్రీరామ్(24) అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3500 నగదు, 8 సిగరెట్ ప్యాకెట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని నిర్మల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో మూడు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై గణేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


