మంచిర్యాలఅర్బన్: తెలుగింట తొలి పండుగ.. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పర్వదినంతోనే ప్రారంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పరాభవ నామ సంవత్సరం గురువారం నాటితో మొదలైంది. పరాభవ అంటే అవమానం, ఓటమి అయినా ఆధ్యాత్మికంగా చూస్తే అ హంకారం, స్వార్థాన్ని జయించి వినయాన్ని అలవర్చుకునే కాలాన్ని సూచిస్తోందని, వ్యక్తి తన లోపాలను గుర్తించి అధిగమించడానికి, పరివర్తనకు మంచి సమయమని, రై తులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజున ఆలయాల్లో పంచాంగ పఠనం ప్రత్యేకంగా నిలుస్తుంది. అర్చకులు, పండితులు రాశుల వారీగా తెలియజేసే ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం జిల్లాలోని ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు పూ ర్తి చేశారు. మంచిర్యాలలో ని విశ్వనాథ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీపరాభవ నామ సంవత్సరా న్ని పురస్కరించుకుని బు డి దామోదర్ శర్మ సిద్ధాంతితో సాయంత్రం ఆరు
IIవ పేజీలో u
దండేపల్లి: మహమ్మాయి అమ్మవారికి పూజలు


