
పిల్లల కోసమే ప్రమోషన్ వదిలి..
వేమనపల్లి: మండలంలోని బుయ్యారం గ్రామానికి చెందిన అర్క పోచయ్య పిల్లల బాగోగుల కో సం ఉద్యోగ రీత్యా ప్రమోషన్ వదులుకుని వారి జీవితాలను తీర్చిదిద్దాడు. తన తండ్రి గంగయ్య గ్రామంలో భూస్వాములకు పాలేరుగా ఉండి పో చయ్యను 10 వతరగతి వరకు చదివించాడు. మంచిర్యాలలో డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్గా చేరి న పోచయ్య ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్గా ప ని చేస్తున్నారు. మేనేజర్గా ప్రమోషన్ వచ్చినా కొడుకుల చదువులకు ఆటంకమేర్పడుతుందని వదులుకున్నాడు. ఉద్యోగరీత్యా మంచిర్యాలలో ఉంటున్నాడు. పెద్ద కొడుకు మనోజ్ గాంధీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో పీజీ చేస్తున్నాడు. రెండో కొడుకు మహర్షి బీటె క్ ‘సివిల్’ పూర్తి చేసి అల్ట్రాటెక్ కంపెనీలో పని చే స్తున్నాడు. మనీశ్ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.