
నాన్న రెక్కల కష్టం.. కూతుళ్ల చదువులకే..
తాంసి: మండలంలోని వడ్డాడి గ్రామానికి చెందిన చింతల పురుషోత్తం–మమత దంపతుల కు ఇద్దరు కూతుళ్లు మధుమిత, మనస్విత సంతానం. పురుషోత్తం తననుకున్న ఎకరంలో వ్య వసాయం చేస్తూ, గొర్రెలు కాస్తూ జీవనాన్ని కొ నసాగిస్తున్నాడు. కుటుంబం గడవడానికి, ఇద్ద రు ఆడపిల్లలను ప్రయోజకులుగా చేయడానికి చాలా కష్టపడి చదివించాడు. తను కష్టపడి సంపాదించిన మొత్తాన్నంతా పిల్లల చదువుకే ఖ ర్చు చేస్తున్నాడు. పెద్ద కూతురు మధుమిత ఉ స్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చే సి ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగాల కోసం నంద్యాలలో కోచింగ్ తీసుకుంటోంది. చిన్న కుమార్తె మనస్విత ఎలాంటి కోచింగ్ లేకుండా మూడేళ్ల క్రితం 2వేల ర్యాంక్ సాధించి మద్రాస్ ఐఐటీలో సీఎస్ఈ విభాగంలో సీటు సాధించి ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతోంది. పేద కుటుంబమైనప్పటికీ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న పురుషోత్తం నాన్నలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.