ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య

Jun 14 2025 10:28 AM | Updated on Jun 14 2025 10:28 AM

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ● విద్యార్థులకు అక్షరాభ్యాసం

జైపూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గు ణాత్మక విద్య అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠఽశాల, టేకుమట్ల, కిష్టాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాల, అంగ న్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు పట్టికలు, రిజిష్టర్లు, తరగతి గదులు పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అక్షరా భా స్యం చేయించారు. ఆయా గ్రామాల్లో భూభార తి రెవెన్యూ సదస్సులను తహసీల్దార్‌ వనజారెడ్డితో కలిసి సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు కలిగి ఉండాలి

నస్పూర్‌: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నా రు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో యుఐడీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మహ్మద్‌ శౌభన్‌, ప్రత్యేక ఉప పాలానాధికారి డి.చంద్రకళ, ఏసీపీ ప్రకాశ్‌లతో కలిసి జిల్లా స్థాయి ఆధార్‌ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అంన్‌వాడీ కేంద్రాలు, పాఠాశాలలు, వసతిగృహాల్లో పిల్లలను చేర్పించే సమయంలో ఆధార్‌కార్డు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఏడుగురు అనాథలకు ఆధార్‌ కార్డు జారీ చేశామన్నారు. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ ఒకసారి, పేరు రెండుసార్లు మాత్రమే సవరించుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఈఓ యాద య్య, లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ తిరుపతి, ఈ డిస్ట్రిక్‌ మేనేజర్‌ సునీల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement