ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన

Jun 14 2025 10:28 AM | Updated on Jun 14 2025 10:28 AM

ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన

ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన

జైపూర్‌: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు(ఎస్టీపీపీ)ను కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. పవర్‌ ప్లాంటు, గనుల పనితీరు అధ్యయనంలో భాగంగా సందర్శనకు వచ్చిన వారికి ప్లాంటు జీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అడ్మిన్‌ భవన కార్యాలయంలో విద్యుత్‌ ఉత్పత్తి, పనితీరు, ఫ్లోటింగ్‌ సోలార్‌, గ్రౌండ్‌ సోలార్‌, ఎఫ్‌జీడీ నిర్మాణ పనితీరును పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎఫ్‌జీడీ నిర్మాణాన్ని పరిశీలించగా అధికారులు పనితీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ వోఅండ్‌ఎం చీఫ్‌ జెన్‌సింగ్‌, ఏజీఎంలు శివప్రసాద్‌, మదన్‌మోహన్‌, సీఎంవోఏఐ బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ సముద్రాల శ్రీనివాస్‌, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు చీఫ్‌ ఇంజనీర్లు ఎంపీ.రాజన్‌, వీ.లత, కే.అనిత, డీజీఎంలు కిరణ్‌బాబు, ఈఈ విష్ణువర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement