శిక్షణ ఐఏఎస్‌ల పర్యటన | - | Sakshi
Sakshi News home page

శిక్షణ ఐఏఎస్‌ల పర్యటన

Jun 14 2025 10:00 AM | Updated on Jun 14 2025 10:28 AM

జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లో శుక్రవారం శిక్షణ ఐఏఎస్‌ అధికారులు పర్యటించారు. భద్రాద్రి కొతగూడెం నుంచి సౌరబ్‌ శర్మ, ఆదిలాబాద్‌ నుంచి సలోని చభ్ర, వికారాబాద్‌ నుంచి హర్షచౌదరి, నిజామాబాద్‌ నుంచి కరోలిన్‌ చింతిన్మవి, నారాయణపేట్‌ నుంచి కోయ్యాడ ప్రణయ్‌కుమార్‌ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జన్నారానికి వచ్చారు. వారికి తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, రేంజ్‌ అధికారి సుష్మారావు స్వాగతం పలికారు. అనంతరం గేట్‌ నంబర్‌–1 నుంచి సఫారీ ద్వారా గొండుగూడ బేస్‌క్యాంపు, బైసన్‌కుంట, మల్యాల వాచ్‌టవర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం అలీనగర్‌, దొంగపల్లి గ్రామాల్లో గిరిజనులతో సమావేశం అయ్యారు. అడవి అభివృద్ధి, ఇక్కడి ప్రత్యేకతలను అటవీ బీట్‌ అధికారి లాలుబాయి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement