
చికిత్స పొందుతూ మృతి
ఇంద్రవెల్లి: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడు మృతి చెందిన ట్లు ఎస్సై సాయన్న తెలిపా రు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. మండలంలోని హర్కపూర్ ఆంద్గూ డ గ్రామానికి చెందిన మస్కే రామేశ్వర్ (25) ఈ నెల 11న ఇంద్రవెల్లికి చెందిన షేక్ సాజిద్తో కలిసి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్కు వెళ్లాడు. రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో మండలంలోని శంకర్గూడ సమీపంలో ప్రధాన రహదారిపై ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కా రు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామేశ్వర్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు ఆ దిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ మృతి చెందాడు. తల్లి విమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పిడుగు పడి ఎద్దు మృతి
నార్నూర్: మండలంలోని తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రకాశ్ అనే రైతుకు చెందిన ఎద్దు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడు గు పడి మృతి చెందింది. వారంరోజుల ముందే విద్యుత్షాక్తో ఒక ఎద్దు మృతి చెందగా.. పిడుగు పడి ఇప్పుడు మరో ఎద్దు మృతి చెందిందని బాధిత రైతు వాపోయాడు. మృతి చెందిన ఎద్దు విలువ రూ.50వేలు ఉంటుందని పేర్కొన్నాడు.
బైక్ చోరీ నిందితుల అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో బైక్ చోరీలకు పా ల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ట్లు స్థానిక సీఐ ప్రమోద్రావు తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, ముఖరాం చౌరస్తా ప్రాంతాల కు చెందిన భరత్రేణ్వా, కుడుదుల శ్రీనుకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు ఇటీవల చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఐబీ చౌరస్తా వ ద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న స్థానిక సూ ర్యనగర్కు చెందిన గుండేటి రాకేశ్, బొల్లి ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా కుడుదుల శ్రీను కు చెందిన బైక్, భరత్ రేణ్వాకు చెందిన స్కూటీని దొంగిలించినట్లు వారు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.

చికిత్స పొందుతూ మృతి