
రైతులను మోసగించిన వ్యక్తి అరెస్ట్
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని జాంగామ్కు చెందిన రైతులను మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్కుమార్ తెలిపారు. శుక్రవా రం పట్టణంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కుభీర్కు చెందిన సంగి శ్రీనివాస్ జల్సాగా తిరుగుతూ, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడేవాడు. కొద్దిరోజులకు కుభీర్ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థకు సీఈవోగా, భైంసాలోని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) సంస్థకు ఏజెంట్గా పని చేస్తున్నాడు. రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి మ్యాక్స్కు విక్రయించి, రైతులకు డబ్బులు చెల్లించేవాడు. ఇలా కొ ద్దిరోజులు రైతులను నమ్మించాడు. ఈ క్రమంలో గ తంలో బెట్టింగ్తో చేసిన అప్పులు తీర్చేందుకు రైతులను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు కుభీర్ మండలం జాంగామ్లో రైతుల నుంచి రూ.13,37,144 విలువైన 690క్వింటాళ్ల మొక్కజొ న్నలు కొని డబ్బులు చెల్లించకుండా పారిపోయా డు. దీంతో రైతులు కుభీర్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కుభీర్లోని పార్డి(బి) ఎక్స్రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించామని తెలిపారు. అతడి నుంచి రూ.9లక్షల నగదు, రిసిప్ట్ బుక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లోకేశ్వరం మండలం మన్మధ్, బామ్ని గ్రామాల్లో 32మంది రైతుల నుంచి 3,685 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి మో సగించినట్లు తెలిపారు. కేసు విచారణ, నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సీ ఐ నైలు, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి, నిర్మల్ ఐటీ టీంను ఎస్పీ జానకీ షర్మిల అభినందించినట్లు చెప్పారు.