
జపాన్ సకురకు సాయి శ్రీవల్లి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన సాయిలు సాయి శ్రీవల్లి జపాన్లో ఆధునిక శాస్త్ర, సాంకేతికతలను వీక్షించేందుకు ఎంపికై ంది. స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా 9వ ఇన్స్పైర్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రదర్శనతో మెప్పించింది. దేశవ్యాప్తంగా 54మంది ఎంపిక కాగా తెలంగాణ నుంచి ఎంపికై న ముగ్గురు వి ద్యార్థుల్లో సాయి శ్రీవల్లి ఒకరు. సమాజంలో మహిళలు, విద్యార్థినులకు రుతుక్రమ సమయంలో రసాయనిక శానిటరీప్యాడ్తో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసేలా రుతుమిత్ర కిట్ ప్రాజెక్టు రూపొందించింది. వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి ప్రాజెక్టులు ప్రదర్శించగా.. జాతీయ స్థాయికి ఎంపిక చేసిన 60 ఉత్తమ ప్రదర్శనల్లో శ్రీవల్లి ఎంపికై ంది. కేంద్రమంత్రి జితేందర్సింగ్, డీఎస్టీ కార్యదర్శి చంద్రశేఖర్, జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ పీఎస్ యోయల్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంది. జపాన్ సైన్స్ స్కూల్ ప్రోగ్రాం(సకుర సైన్స్ పోగ్రాం)కు ఎంపిక కాగా.. ఈ నెల 15నుంచి 21వరకు జపాన్లో నిర్వహించే కార్యక్రమంలో పా ల్గొంటుంది. ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రిన్యూర్షిప్–2023 పే రిట ఢిల్లీ లోని రాష్ట్రప తి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రు తుమిత్ర కిట్ ప్రాజెక్టు ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎదుట ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. శ్రీవల్లి తల్లి దండ్రులు మధుబాబు, ఉమ మంచిర్యాలలో ప్రభు త్వ టీచర్లు. ఇటీవల ప్రకటించిన ‘పది’ ఫలితాల్లో శ్రీవల్లి 588మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది.
జపాన్ శాస్త్రవేత్తలతో ముఖాముఖి
సాయి శ్రీవల్లి జపాన్లోని టోక్యోలో విరైకాన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్, సుకుబా సైన్స్సిటీలో ఉన్న స్పేస్ సెంటర్, నేచర్ అండ్ సైన్స్ మ్యూజియం, యూనివర్సిటీ ఆప్ టోక్యో వీక్షిస్తుంది. అక్కడ పాఠశాల విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో జపాన్లో అభివృద్ధిపై తెలుసుకుంటుంది. నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటుంది.