
రేషన్ బియ్యం పట్టివేత
భైంసాటౌన్: పట్టణంలోని టిప్పుసుల్తాన్ చౌక్ వద్ద గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టున్నట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. వాహన తనిఖీలు చేపడుతుండగా బొలెరో వాహనంలో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో అందులో 25 క్వింటాళ్ల రేషన్బియ్యం లభించడంతో సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి, బియ్యం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
న్యాక్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
కైలాస్నగర్: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు నాబార్డు ఆధ్వర్యంలో న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ల్యాండ్ సర్వేయర్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు న్యాక్ ఏడీ నాగేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ , ఇంటర్, ఐటీఐ అ ర్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం సైతం కల్పించనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్, బెల్లంపల్లి కేంద్రంగా అందించే ఈ శిక్షణను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 9866565156, 6281444199 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఒకరి అరెస్టు
సిర్పూర్(టి): మండలంలోని బెంగాళీ క్యాంపు కాలనీకి చెందిన అలోక్పాల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదరు యువకుడు 2024 నుంచి చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుండడంతో అతనిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టులో రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్సై కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు.