
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● జీసీసీ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్
ఉట్నూర్రూరల్: గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఉట్నూర్ జీసీసీ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్ అన్నారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆదేశాల మేరకు గురువారం జీసీసీ ఉమ్మడి జిల్లా మేనేజర్లు, అకౌంటెంట్లు, గోడౌన్ క్లర్క్లు, జూనియర్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపథ్యంలో పిల్లలకు అవసరమైన నిత్యావసరాలు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. అన్ని వస్తువుల కాలపరిమితి స్వయంగా పరిశీలించిన తరువాతే సరఫరా చేయాలన్నారు. గోడౌన్లలో ఉన్న రికార్డులను, రిజిస్టర్లను వెంటనే అప్డేట్ చేయాలన్నారు. స్టాక్ వివరాలను డీఎం కార్యాలయానికి పంపించాలన్నారు. అనంతరం ఆయనను మేనేజర్లు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.