
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
కౌటాల: వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గుండాయిపేట గ్రామానికి చెందిన ఉర్వత్ కమలాబాయి(56) కొంతకాలంగా మద్యానికి బానిసైంది. మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలిస్తుండగా బావిలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచా రం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమి త్తం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించా రు. మృతురాలి కుమారుడు ఉ ర్వత్ బండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.