
బ్లాక్ స్పాట్ల గుర్తింపు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం మంచిర్యాల రూర ల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రా జ్, కమిషనరేట్ రోడ్డు భద్రతా విభాగం హెడ్ కాని స్టేబుల్ చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఏఈఈ రవికిరణ్, జాతీయ రహదారి జేఈ సతీశ్, పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదా లు జరిగే ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా గ్రామాల రహదారులు జాతీయ రహదారిని సమన్వయం చేసే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు గాను స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, జాతీయ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్ లైటింగ్ పెంచడం, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన ప్రాంతాలతో పాటు వారసంతల వద్ద బారికేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.