తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు

Jun 11 2025 11:36 AM | Updated on Jun 11 2025 11:39 AM

తేనెట

తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు

తానూరు: మండలంలోని ఝరి(బి)తండా గ్రామ శివారులో మంగళవారం పత్తి విత్తనాలు విత్తుతున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన బాధితులను గ్రా మస్తులు 108 అంబులెన్స్‌లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో రాథో డ్‌ గోవర్ధన్‌, హరిదాస్‌, సుభాష్‌, ధన్‌రాజ్‌, దేవుకబాయి, శివరాజ్‌కు గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

జీసీసీ డీఎంగా పీహెచ్‌వోకు అదనపు బాధ్యత

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజన్‌ మేనేజర్‌గా ఐటీడీఏ ఉట్నూర్‌ ప్రాజెక్ట్‌ ఉద్యాన అధికారి (పీహెచ్‌వో) సందీప్‌కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఎంగా పని చేసిన వీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినందున తాత్కాలికంగా సందీప్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలో తెరచుకోనున్న నేపథ్యంలో ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సూచన మేరకు సందీప్‌కు అదన పు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్‌ను జీసీసీ సిబ్బంది గోవింద్‌రావు, లింబారావు, సత్యనారాయణ తదితరులు సన్మానించారు.

మొక్కలు తొలగించి, చెట్లు నరికి నిరసన

కడెం: రాంపూర్‌, మైసంపేట్‌ పునరావాస గ్రామస్తుల ఆందోళన రెండోరోజూ కొనసాగింది. మంగళవారం గ్రామస్తులు మరిన్ని గుడిసెలు వేసి అక్కడే వంట చేసుకుని మకాం వేశారు. ఉడుంపూర్‌ ఎఫ్‌ఆర్వో అనిత ఎదుటే రాంపూర్‌ గిరిజనులు ప్లాంటేషన్‌లో మొక్కలు తొలగించారు. చెట్లు నరికి నిరసన తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎఫ్‌డీవో భవానీశంకర్‌ ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడినా వారు వినలేదు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు.

తేనెటీగల దాడిలో   ఆరుగురికి గాయాలు1
1/2

తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు

తేనెటీగల దాడిలో   ఆరుగురికి గాయాలు2
2/2

తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement