ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు

Jun 11 2025 11:36 AM | Updated on Jun 11 2025 11:39 AM

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆది లాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో రౌ డీయిం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని ఇందరమ్మ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి అతడి నుంచి రూ.2వేలు లా క్కున్న బంగారుగూడకు చెందిన షేక్‌ సలీంతో పా టు మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసి రౌడీయిజం చేస్తే పోలీసులకు ఫి ర్యాదు చేయాలని, అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ ఫణిధర్‌, ఎస్సై విష్ణువర్ధన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement