
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
బెల్లంపల్లి: లేబర్ కోడ్ల రద్దు కోరుతూ జూలై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, బెల్లంపల్లి మండల కన్వీనర్ సీహెచ్ దేవదాస్ కోరారు. మంగళవారం బెల్లంపల్లి సీఐటీయూ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మి క, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడానికి సిద్ధపడిందని విమర్శించారు. ఈ తీరు అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో కార్మికులు సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాల ని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూ నియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, శ్రేణులు పద్మ, అనురాధ, రాజేశ్వరి, స్వాతి, సీఐటీయూ శ్రే ణులు యాకూబ్, సుమన్, నారాయణ, రవీందర్, విశ్వనాథ్, అనిల్, రాహుల్, కిశోర్ పాల్గొన్నారు.