21నుంచి సీపీఐ జిల్లా మహాసభలు | - | Sakshi
Sakshi News home page

21నుంచి సీపీఐ జిల్లా మహాసభలు

Jun 11 2025 11:35 AM | Updated on Jun 11 2025 11:38 AM

21నుంచి సీపీఐ జిల్లా మహాసభలు

21నుంచి సీపీఐ జిల్లా మహాసభలు

పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22వ తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు కలవేన శంకర్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రామసుధా రెసిడెన్సిలో మహాసభల నిర్వహణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21న ప్రదర్శన మహాసభ, 22న ప్రతినిధుల సభ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నాయకులు మేకల దాసు, మిట్టపల్లి పౌలు, వెంకట స్వామి, రేగుంట చంద్రశేఖర్‌, ఖలిందర్‌ అలీఖాన్‌, ముష్కె సమ్మయ్య, రేగుంట చంద్రకళ, లింగం రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement