
వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్జోన్ ఫీల్డ్ డైరెక్టర్(ఎఫ్డీపీటీ) శాంతారాం అన్నారు. మంగళవారం నస్పూర్లోని సమావేశమందిరంలో వన్యప్రాణుల సంరక్షణపై క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని అన్నారు. జంతువులను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నైపుణ్యం కలిగిన వారితో ప్రత్యేక శిక్షణ అవసరమని అన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50మందికి గన్ఫైరింగ్తో కూడిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్, ఏ.శంకరన్, సయ్యద్ మోహినొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.