
‘ఖర్గే’ను కలిసిన మంత్రి వివేక్
చెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి తన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖా ర్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. సోమవారం ఢిల్లీలో వారిని కలి సి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ రా ష్ట్రంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చే యాలని, రానున్న కార్పొరేషన్, మున్సిపాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా పని చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిపారు.