
అర్హులకే పథకాలు అందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: అర్హులైన నిరుపేదలకు రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా, పాన్కార్డును పరిగణనలోకి తీసుకోకుండా రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు అందించాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇందిరమ్మ ఇళ్ల మొదటి జాబి తాలో చేర్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, అకుల అశోక్వర్ధన్, ఎనగందుల క్రిష్ణ, పులుగం తిరుపతి, స త్రం రమేష్, జీవీ ఆనంద్కృష్ణ, బొలిశెట్టి అశ్వి న్, నాగేశ్వర్రావు, సదానందం, రాజమౌళి, చక్రి, రాజేశం, సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.