
విప్లవ వీరుడా.. ఇక సెలవు..!
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఆయన స్వగ్రామం పొచ్చెరలో కు టుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, అభిమానుల మధ్య ముగిశాయి. అడెల్లు అంతిమయాత్రలో గ్రా మం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. ఆదివారం రార తి బీజాపూర్ నుంచి పొచ్చెర గ్రామానికి ఆడెల్లు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అడెల్లు భౌతికకాయంపై ఎర్రని వస్త్రం ఉంచి నివాళులర్పించారు. సోమవారం ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), సీపీఐ డెమొక్రటిక్, ప్రజాసంఘాల నాయకులు, మాజీ మావోయిస్టులు, అభిమానులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అడెల్లు భౌతికకాయానికి నివాళులర్పించా రు. గ్రామంలోని వీధుల గుండా అంతిమయాత్ర ని ర్వహించారు. పౌర హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, విరసం నేతలు, మాజీ మావోయిస్టులు, కళాకారులు పాటలు, నృత్యాలు చేస్తూ అడెల్లుకు నివాళులర్పించారు. ఎర్రజెండాలు చేతపట్టి, అడెల్లు అమర్రహే అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలో ముందుకుసాగారు. ‘ఆదివాసీలదే అడవి, కగా ర్ ఆపరేషన్ ఆపివేయాలని’ ప్లకార్డులు పట్టుకుని అంతిమయాత్ర నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర 3 గంటలకు ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. ప్రజా సంఘా ల నేతలు సైతం కన్నీరుమున్నీరయ్యారు. మాజీ మావోయిస్టులు ఉద్యమంలో అడెల్లుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విలపించారు. కాగా గ్రామంలోని వైకుంఠధామం వద్ద అడెల్లుకు అంత్యక్రియలు నిర్వహించారు. అడెల్లు అన్న పెద్ద అడెల్లు దహన సంస్కారం నిర్వహించారు.
‘చంపే హక్కు ఎవరికీ లేదు’..
అడెల్లు భౌతికకాయం వద్ద పౌర హక్కుల నాయకులు, అమరుల బంధు,మిత్ర సభ్యులు, మానవహక్కుల వేదిక నాయకులు, విప్లవ రచయిత సంఘం(విరసం) నేతలు మాట్లాడారు. ఒక మనిషిని చంపే హక్కు రాజ్యాంగం కల్పించలేదని, అలాంటిది రాజ్యాంగాన్ని విస్మరిస్తూ మావోయిస్టులను పిట్టల్లా చంపుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తే వారిని చంపుతారా అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భజంగ్ రావ్ అన్నారు. అడెల్లును పట్టుకుని, విషంతో కూడిన ఆహారం తినిపించి చెట్టుకు కట్టి కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
మఫ్తీలో పోలీసులు..
అడెల్లు అంత్యక్రియల్లో పోలీసులు మఫ్తీలో ఉండి నిఘా వేశారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం అంత్యక్రియలు ముగిసే వరకు కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు.
భౌతికకాయంపై ఎర్రజెండా కప్పుతున్న విరసం, అమరుల బంధుమిత్ర సభ్యులు
30 ఏళ్ల ఉద్యమ బాటకు ఇక సెలవు.. నూనూగు మీసాల వయస్సులో పేగు బంధాన్ని తెంచుకుని పోరు బాటలో నడిచి, చివరకు అడవిలో రక్తపు సింధూరమై 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన అడెల్లు మృతదేహం ఎర్రని వర్ణపు తాకిడికి తడిసి ముద్దయింది. కట్టెలో తన మేను కాలినా, అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనాలను చూస్తే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడని రుజువైంది.
– బోథ్
ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మైలారపు అడెల్లు భౌతికకాయానికి బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడెల్లు సొంత లాభం కోసం పనిచేయలేదని, పేద ప్రజల కోసమే చిన్న వయస్సులోనే ఉద్యమంలోకి వెళ్లాడన్నారు. 30 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉండి పేద ప్రజల పక్షాన నిలబడ్డాడని తెలిపారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కగార్ పేరుతో చేపట్టిన ఎన్కౌంటర్లు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఇవి ఎన్కౌంటర్లు కావని పట్టుకొచ్చి కాల్చి చంపడమని ఆరోపించారు. అడెల్లు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు రూ.10 వేలు అందించారు.

విప్లవ వీరుడా.. ఇక సెలవు..!

విప్లవ వీరుడా.. ఇక సెలవు..!