
దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురి రిమాండ్
ఆదిలాబాద్రూరల్: దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన బాలు అనే వ్యక్తి బంగారుగూడకు చెందిన షేక్ ముజ్జు అనే వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈక్రమంలో అధిక వడ్డీ కోసం ఆదివారం ఆయన ఇంటికి షేక్ సలీమ్, షేక్ సమీర్లతో వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఆయన వద్ద నుంచి రూ.2వేల నగదు లాక్కున్నారు. దీంతో బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.