
‘సాక్షి’పై దాడులు అమానుషం
కరీంనగర్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్, ఆంధ్రప్రదేశ్లోని ‘సాక్షి’ కార్యాలయాలపై దుండగుల దాడిని ఖండిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని సాక్షి యూనిట్ ఆఫీస్ వద్ద జర్నలిస్టులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాలరాస్తూ అణచివేయాలని చూడడం దారుణమన్నారు. నిరసనలో యూనిట్ మేనేజర్ వైద శ్రీనివాస్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జీలు ముజఫర్, గుర్రాల మహేశ్, డెస్క్ జర్నలిస్టులు బొగ్గుల సంతోష్, ములుకుంట్ల కనకేశ్వర్, మామిండ్ల బాలనర్సయ్య, డి.రాజశేఖర్, పోలు సంపత్, దూట వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.