లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

Jun 10 2025 3:28 AM | Updated on Jun 10 2025 3:28 AM

లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

భీమారం: మహారాష్ట్ర నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 35 పశువులను సోమవారం భీమారం సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దఎత్తున పశువులను లారీల్లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు భీమారంలో తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపగా లారీ డ్రైవర్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పారిపోతున్న డ్రైవర్‌ను వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా ఎద్దులను మహారాష్ట్ర నుంచి జగిత్యాల జిల్లా రాజరాంపల్లికి తరలిస్తున్నామని తెలిపాడు. అనంతరం లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ రుక్సాకా, యజమాని పంకజ్‌ గోపాల్‌ సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. పశువులను చెన్నూరు పట్టణం సమీపంలోని గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా వెటర్నరీ వైద్యుడు రాకేశ్‌ శర్మ పశువులకు పరీక్షలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement