
ఇద్దరి మధ్య గొడవ..ఒకరి మృతి
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ధన్గర్గల్లీకి చెందిన ముఖీమ్ (20), అదే కాలనీకి చెందిన షరీఫొ ద్దీన్లకు మధ్య శనివారం రాత్రి గొడవ చోటుచేసుకుంది. షరీఫొద్దీన్ ముఖీమ్ను నెట్టివేయడంతో కిందపడ్డాడు. శ్వాస ఆడక మృతిచెందాడు. స్థానికులు గమనించి వైద్యం కోసం రిమ్స్కు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తుచేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు.
బావిలో పడి బాలుడి..
కౌటాల: మేకలు మేపడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..మండలంలోని గురుడుపేటకు చెందిన నాగోసే రవీందర్, భాగ్య దంపతుల కుమారుడు అంజన్న(16) పది తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధపడుతున్నాడు. ఆదివారం ఉదయం తమ మేకలను మేపడానికి మరో ముగ్గురు యువకులతో కలిసి గ్రామశివారులో వెళ్లారు. పొక్లెయిన్తో తవ్విన వ్యవసాయ బావిలో నీరు తాగేందుకు వెళ్లిన అంజన్న ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాక నీటిలో మునిగిపోయాడు. సదరు యువకులు గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. వారు అక్కడికి చేరుకుని అంజన్నకు బయటకు తీసి సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్(టి) ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. చేతికందిన కుమారుడు మృతితో కుటుంబీకులు బోరున విలపించారు. మృతుడికి చెల్లి అనురాధ, తమ్ముడు అనుదీప్ ఉన్నారు.
చికిత్సపొందుతూ విద్యార్థి..
మాక్లూర్(ఆర్మూర్): ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన నిర్మల్ జిల్లాకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం..నిర్మల్ జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన సిందే శివకుమార్(17) నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో అతడిని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్.. ఈనెల 6న సెమిస్టర్ పరీక్షలు రాయడానికి నిజామాబాద్కు వచ్చాడు. మాక్లూర్ మండలం దాస్నగర్ శివారులో గడ్డి మందు తాగి హాస్టల్కు వెళ్లాడు. అక్కడ వాంతులు చేసుకోవడంతో స్నేహితులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ సమాజ్ ఏకతాటిపైకి వచ్చి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పర్ధాన్ జన్జాతి ఉత్తన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేశ్ పిలుపునిచ్చారు. బజార్హత్నూర్ మండలం ఏసాపూర్లో ఈనెల 28న నిర్వహించనున్న గోండి ధర్మ గురువు హీరా సుకా విగ్ర హ ప్రతిష్ఠాపన, భారీ బహిరంగసభ విజయవంత ం కార్యచరణపై జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి దుర్గదాస్ ఉయికే, మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అందరి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యాదవ్ రావ్, రాంకిషన్, నారాయణ, వనిత, గీత, పాండురంగ్, విఠల్ పాల్గొన్నారు.