
విద్యుత్ పోల్స్ టాక్స్ రద్దు చేయాలి
నస్పూర్: జిల్లాలోని కేబుల్ టీవీ ఆపరేటర్లకు విద్యుత్ పోల్ టాక్స్ రద్దు చేయాలని కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూడ రాంరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట జిల్లాలో ని కేబుల్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ రాజేశ్వర్రావుకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలు, ప ట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని ప్రాంతాల్లో విద్యుత్ పోల్స్ టాక్స్ చెల్లించా లంటే కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. మంచిర్యాల మండల అధ్యక్షుడు గాండ్ల సత్యం, నస్పూర్ మండల అధ్యక్షుడు పంబాల తిరుపతి, భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్, జైపూర్ అధ్యక్షుడు వెంకన్న, చెన్నూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, లక్షెట్టిపేట అధ్యక్షుడు భూమేశ్, దండేపల్లి అధ్యక్షుడు శంకర్, నాయకులు ఏల్పుల మల్లేశ్, గుమ్ముల శ్రీనివాస్, లక్ష్మణ్, రాజేందర్, మల్లేశ్, రాజు, శేఖర్, రవీందర్ పాల్గొన్నారు.