
అభివృద్ధి పనుల పూర్తికి కృషి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం విశ్వనాథ ఆలయం వద్ద దుకాణాల కూల్చివేతను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు, అధికారుల సహకారంతోనే ఆలయ అంతర్భాగంలో ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని రోడ్ల వెడల్పు, ఐటీ పార్కు, నిర్మాణ పనులను లక్ష్మీటాకీస్ నుంచి రంగంపేట వరకు ఫోర్లేన్ రోడ్డు నిర్మాణాలు, పట్టణంలో మాతాశిశు ఆసుపత్రి పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఐదారు నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.