
విద్యార్థులకు మంచి బోధన అందించాలి
లక్సెట్టిపేట: విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలపై ఉన్న ప్రేమతో పేద విద్యార్థుల ఉజ్వల భవి ష్యత్ కోసం నిధులు మంజూరు చేయించి భవన ని ర్మాణం పూర్తి చేశానని, తన కల నెరవేరిందని అ న్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని కోరారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కళాశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించారు. జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు ప్రేంచంద్, ఎండీ.ఆరీఫ్, చింత అశోక్, గడ్డం త్రిమూర్తి, నాగభూషణం, పింగిళి రమేష్, డీసీపీ భాస్కర్, డీఈవో యాదయ్య, డీఐఈవో అంజయ్య, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ, ఎంఈవో శైలజ, ఈఈ, ఏఈ పాల్గొన్నారు.
గురువుకు ఎమ్మెల్యే పాదాభివందనం
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తనకు పదవ తరగతిలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడు హరిచందర్ను శా లువాతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు పాదాభివంద నం చేశారు. 1973–74లో 10వ తరగతి చదువుతు న్న సమయంలో ఇదే బడిలో గణితం బోధించారని అన్నారు. గురుశిష్యులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ కళాశాల నూతన భవనం ప్రారంభం

విద్యార్థులకు మంచి బోధన అందించాలి