
జంగల్ సఫారీలోకి 15 జింకలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాతమంచిర్యాల అట వీ సెక్షన్ పరిధిలో గల తిమ్మాపూర్ అటవీ బీట్లోని జంగల్ సఫారీలోకి ఆదివారం 15 జింకలను వదిలిపెట్టారు. హైదరాబాద్ హయత్నగర్ మహావీర్ హరిని వనస్థలి జాతీయపార్కు నుంచి తీసుకువచ్చిన జింకలను సఫారీలోని గ డ్డి మైదానాల్లోకి వదిలిపెట్టారు. అవి గెంతులు వేస్తూ పరుగులు పెట్టాయి. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాశ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఓ కొప్పుల రవి, ఎఫ్ఎస్ఓ అతావుల్లా, ఎఫ్బీఓలు రాజేందర్, స్వప్న పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన
ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆ సుపత్రిని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు సందర్శించారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించుకున్నారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. పార్టీ నాయకులు అబ్దుల్ ఖయ్యుం, నాయకులు ఉన్నారు.

జంగల్ సఫారీలోకి 15 జింకలు