
సీవోఈ విద్యార్థుల ప్రభంజనం
బెల్లంపల్లి: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, నీట్, క్లాట్, యూపీఎస్సీ తదితర ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షల్లో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం గురుకుల విద్యాలయ సంస్థ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించింది. సీవోఈ విద్యార్థులు అత్యధికంగా 15 మంది ఎంపికై రికార్డు సృష్టించారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్ ప్రకటించారు. ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన గురుకులాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 2025–26లో 8వ తరగతిలో ప్రవేశం కల్పించి ఐఐటీ, నీట్, క్లాట్, యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతిభావంతంగా తీర్చిదిద్దుతారు. గత ఏప్రిల్ 21 ప్రవేశపరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 7వ తరగతి చదువుతున్న గురుకుల విద్యార్థులను ఎస్ఏ–1లో వచ్చిన మార్కుల ప్రాతిపదిక స్క్రీనింగ్ టెస్ట్కు ఎంపిక చేశారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
సీటు సాధించిన విద్యార్థులు వీరే..
ఫౌండేషన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధన సాగించడానికి రారష్ట్రవ్యాప్తంగా బాల,బాలికల కోసం 10 గురుకుల సీవోఈ కళాశాలలను ఎంపిక చేశారు. ఐ దు సీవోఈ కళాశాలలను బాలురకు మరో ఐదు సీ వోఈ కళాశాలలను బాలికలకు కేటాయించారు. దా గం శోభిత్, డి.సిద్దార్థ, బి.సాయిసృజన్ (గౌలిదొడ్డి సీవోఈ కళాశాల), కె.నవనీత్ (చిలుకూరు సీవోఈ కళాశాల), డి.ఆశ్రిత్, ఎం.శ్రావణ్, డి.హృతిక్ తేజ, కె.కార్తీక్ (ఉప్పల్ సీవోఈ కళాశాల), ఎన్.రుషికేష్, బి.ఉషాకిరణ్, డి.వరప్రసాద్, సీహెచ్.మిథున్, ఎం.పున్నంచందర్, కె.కార్తీక్, పి.విరాజ్ (ఇబ్రహీంపట్నం సీవోఈ కళాశాల) ఎంపికయ్యారు. రాష్ట్రస్థా యి పోటీపరీక్షల్లో విజయం సాధించి ఫౌండేషన్ కో ర్సుకు ఎంపికై న విద్యార్థులను, ఉపాధ్యాయులు మల్టీజోనల్ అధికారి అలివేలు, సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్సాగర్ అభినందించారు.
ఐఐటీ ఫౌండేషన్
ప్రవేశపరీక్షలో ప్రతిభ
ఫలితాల్లో 15 మంది ఎంపిక

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం

సీవోఈ విద్యార్థుల ప్రభంజనం