
దుబాయ్లో జిల్లావాసి తంటాలు
● ఇరాక్ పంపిస్తానని సబ్ ఏజెంట్ మోసం ● బాధితుడిని స్వగ్రామానికి రప్పించాలి ● ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు రాష్ట్రకమిటీ సభ్యుడికి కుటుంబీకుల వినతి
నిర్మల్ఖిల్లా: ఇరాక్ పంపిస్తానని చెప్పి దుబాయ్కు పంపి సబ్ ఏజెంట్ మోసం చేయడంతో జిల్లావాసి తంటాలు పడుతున్నాడు. వివరాలు ఇలా.. జిల్లాలో ని సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన కిష్టపురం లస్మన్న(42) గత కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నాడు. గతేడాది స్వగ్రామానికి తిరిగివచ్చి మెరుగైన ఉపాధికోసం ఇరాక్ వెళ్లాలని గతేడాది నవంబర్లో గ్రామానికి చెందిన ఓ మధ్యవర్తికి రూ.2 లక్షలు ఇచ్చి వీసా కోసం ప్రయత్నించాడు. సదరు వ్యక్తి నిజామాబాద్ జిల్లా చాకిర్యాలకు చెంది న ఓ సబ్ఏజెంట్ ద్వారా ఇరాక్ పంపేందుకు ఏర్పా టు చేశాడు. సబ్ ఏజెంట్ దుబాయ్లోని పవర్ రి క్రూట్మెంట్ ఎల్.ఎల్.సీ లేబర్ సప్లై కంపెనీకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ వీసా అంటగట్టి దుబాయ్ పంపాడు. ఇరాక్ పంపడానికి కొంత టైం పడుతుందని చెప్పగా చేసేదేమి లేక లస్మన్న కొన్నినెలల క్రితం దుబాయ్ వెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నాడు. తక్కువ వేతనంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కుటుంబీకులకు తెలిపాడు. భార్య లక్ష్మి సదరు సబ్ ఏజెంట్ ఇంటికి వెళ్లి నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనడంతో మోసపోయామని గుర్తించిన లస్మన్న కుటుంబీకులు శనివారం నిర్మల్లో ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి విన్నవించారు. భర్త లస్మన్నను స్వగ్రామానికి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు.