
‘పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం’
కోటపల్లి: పేదల అభ్యున్నతి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం కొల్లూర్, రాంపూర్, దేవులవాడ, రాజారం, బబ్బరుచెల్క, లక్ష్మీపూర్, వెలమపల్లి, అన్నారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అన్నారం గ్రామ పర్యటనలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని, బీసీలు, ఓసీలకు మంజూరయ్యాయని గ్రామస్తులు ఎమ్మెల్యేను ప్ర శ్నించారు. రాజారంలో రోడ్డు వేస్తానని ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, గ్రామాని కి అంబులెన్స్, గ్యాస్ బండి రావడం లేదని మహిళలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే రోడ్డు అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. లక్ష్మీపూర్ గ్రామంలో కార్యకర్తలే తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, గ్రామ సమస్యలను విన్నవించినా పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ పానెం శంకర్ ఎమ్మెల్యేను ప్రశ్నించగా ఎస్సై రాజేందర్ కలుగజేసుకుని పక్కకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్, శ్వేత, నాయకులు పాల్గొన్నారు.