మన్ననూర్: తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన సలేశ్వరం జాతరలోనూ 108 సిబ్బంది సేవలు భేష్ అనిపించాయి. ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు కొంత మేరకు భక్తులకు ఇబ్బందులు కలిగినప్పటికి 108 అంబులెన్స్ సిబ్బంది అందించిన వైద్యసేవలు ఆశించినస్థాయిలో అస్వస్థతకు గురైన భక్తులకు అందుబాటులో ఉన్నట్లు పలువురు ప్రశంసించారు. మూడురోజుల పాటు 108 అంబులెన్స్, 9 మొబైల్ వాహనాలు (బైక్లు) అటవీ మార్గంలో పర్యటిస్తూ అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య పరమైన సేవలు అందించారు. ఈ క్రమంలో అటవీ మార్గంలో ఇబ్బందులకు గురైన సుమారు 30 మందికి ప్రత్యక్షంగా వైద్యసేవలతోపాటు మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు, తాగునీరు అందించి సఫర్యలు చేశారు.


